పంతులు గారి మాటలకు ఊర్మిళాదేవి " ఏం మాట్లాడుతున్నారు పంతులుగారు మళ్లీ ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి, మీరు జాతకాలు సరిగ్గా చూసి ఉండరు మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి " అని అంటారు." లేదమ్మా అన్నీ ఒకటికి పది సార్లు శ్రునంగా చూసిన తర్వాతే చెప్తున్నాను, వీళ్ళ ఇద్దరి పెళ్లి జరగడం అంత మంచిది కాదు " అని అంటారు పంతులుగారు. " పోనీ పరిష్కారాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి పంతులుగారు" అని అడుగుతారు గాయత్రి గారు." లేదమ్మా పరిష్కార లాంటివి కూడా ఏమీ లేవు. ఈ పెళ్లి జరిగితే ఇంట్లో పెద్ద వాళ్లకి ప్రాణగండం ఉంది " అని అంటారు.ఆదిత్య కి అక్కడ జరుగుతున్నది అంతా చిరాకు వేసి గాయత్రి వైపు చూసి " అమ్మ ఈ కాలంలో కూడా ఈ జాతకాలు ఇవి ఏంటి ఇద్దరి మనుషులు ప్రేమించుకుంటే చాలు , వారి ఇద్దరి మనసులు